న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికరలాభం ఈ సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 34 శాతం వృద్ధిచెంది రూ. 4,720 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో బ్యాంక్ రూ. 3,511 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. ఈ క్యూలో యూనియన్ బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 28,282 కోట్ల నుంచి రూ. 32,036 కోట్లకు చేరింది.
నికర వడ్డీ ఆదాయం మాత్రం స్వల్ప తగ్గుదలతో రూ. 9,047 కోట్లుగా నమోదయ్యింది. వడ్డీ మార్జిన్లు సైతం 3.18 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గాయి. అయితే బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 6.38 శాతం నుంచి 4.36 శాతానికి, నికర ఎన్పీఏలు 1.30 శాతం నుంచి 0.98 శాతానికి మెరుగుపడ్డాయి.