బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 29: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అన్నివర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తోందని, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని బీజేపీ నేత తోకల శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మైలార్దేవ్పల్లిలో ఆదివారం బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ అడికె జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డివిజన్లోని ప్రతి బూత్ నుంచి 400 మంది చొప్పున మొత్తం 20 వేల మందికి పార్టీ సభ్యత్వాలు ఇప్పించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.