అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్రెడ్డి
కరీంనగర్, సెప్టెంబరు 25 (విజయక్రాంతి): కరీంనగర్, ఆదిలాబాద్, నిజామా బాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను బరిలో నిలస్తున్నానని, యువత అండగా నిలిచి గెలిపిస్తే వారి గొంతుకనవుతానని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి అన్నారు.
బుధవారం కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న నరేందర్రెడ్డికి పెద్ద ఎత్తున యువత బైక్ ర్యాలీతో స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ముల్కనూరు చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు.