calender_icon.png 30 April, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం శుభ్రత యంత్రంపై అవగాహన

29-04-2025 12:00:00 AM

మందమర్రి, ఏప్రిల్ 28 : మండలంలోని రైతులకు ఆటోమాటిక్ వరి శుభ్రత యంత్రం వాడే విధానం తద్వార కలిగే ప్రయోజనాల పై రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పించారు. మండలంలోని సారంగప ల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి మాట్లాడారు.

ఆటొమాటిక్ వరి క్లీనర్  వ్యవసాయ మార్కెట్ కమిటీ, లక్షేట్టిపెట్ ద్వారా మండలానికి మంజూరు అయిందని ఈ యంత్రంనుపయోగించి ఒక గంట వ్యవధిలో ఒక ఎకరా పొలంలో పండిన ధాన్యా న్ని శుభ్రపరచుకోవచ్చని,  యంత్రానికి అమర్చబడిన పొడవాటి పైప్‌ను ధాన్యం కుప్ప వద్ద ఉంచినప్పుడు విద్యుత్ మోటార్ ద్వారా యంత్రం పని చేసి ఫ్యాన్ ద్వారా జాలీల నుండి నాణ్యమైన  ధాన్యం ప్రత్యేకంగా వేరు చేయబడి అందులో నుండి తాలు, తప్ప, రాళ్లు, రప్పలు, మట్టి పెల్లలు, వరి గడ్డి వంటి వి ప్రత్యేక మార్గం ద్వారా బయటికి వస్తాయన్నారు.

రైతులందరు ఈ యంత్రాన్ని విని యోగించుకొని నాణ్యమైన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించడంలో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తర ణ అధికారి కనకరాజు, వరి కొనుగోలు కేం ద్రం ఇంచార్జ్ రాయమల్లు, రైతులు ఫిరోజ్, మధునయ్య, గౌస్, ఐలయ్య పాల్గొన్నారు.