calender_icon.png 17 October, 2024 | 1:49 PM

పెద్దమనుషుల ఒత్తిడితో.. వ్యక్తి ఆత్మహత్య

17-10-2024 11:19:49 AM

తూర్పు గూడెంలో ఘటన, చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామంలో స్థానిక పెద్ద మనుషులు పంచాయితీలో భాగంగా ఓ వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించగా అవమానానికి గురై పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తూర్పు గూడెం గ్రామం కుమ్మరి కులానికి చెందిన తాడూరి కృష్ణయ్య 33 అదే గ్రామానికి చెందిన కాసురా బోయిన రేణుకతో అక్రమ సంబంధం ఉన్నదని స్థానిక గ్రామ పెద్ద మనుషులైన చిట్యాల రాఘవరెడ్డి, తొట్ల శ్రీనివాస్, చెల్లగుల్ల వెంకన్న, చల్లగుల్ల రాములమ్మ, అవిలయ్యలు, రేణుకతో కావాలని పోలీస్ స్టేషన్లో ఈనెల 15న ఫిర్యాదు చేయించారు.

దీనితో మనస్థాపానికి గురై తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన కృష్ణ పురుగుల మందు తాగి అపస్మారస్థితికి చేరుకున్నాడు. దీన్ని గమనించిన కుటుంబీకులు హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ఏరియా దావకానకు తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 16 రాత్రి కృష్ణయ్య మృతి చెందాడు. దీనితో భార్య అనిత పెద్దమనుషులు కావాలని తన భర్తపై అక్రమ సంబంధం ఉన్నట్లు మోపుతూ, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. దీనితోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, పెద్ద మనుషులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనితో జరిగిన సంఘటనపై తుంగతుర్తి ఎస్సై ఏడుకొండలు పూర్తిస్థాయిలో విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా నేడు గ్రామాల్లో చిన్న చిన్న పంచాయతీలు లక్షల రూపాయలు ఏ కర్ణం పెట్టించి, ఆనందాలు పొందుతూ, డబ్బుల కోసం కక్కుర్తి పడడంతో అమాయక ప్రజలు మృతి చెందడం గమనార్వం. జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో  విచారణ జరపాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులను గ్రామస్తులు కోరుతున్నారు...