బెంగళూరు: ప్రతిష్ఠాత్మక రంజీ 2024-25 సీజన్కు మొదటి రెండు రౌండ్ మ్యాచులకు మయాంక్ అగర్వాల్ కర్ణాటక కెప్టెన్గా వ్యవహ రించనున్నాడు. కర్ణాటక అక్టోబర్ 11న మధ్యప్రదేశ్తో, అక్టోబర్ 18న కేరళతో తలపడనుంది. గత సీజన్లో కర్ణాటక జట్టు చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. దులీప్ ట్రోఫీలో పెద్దగా ఆకట్టుకోని మయా ంక్ ఈ టోర్నీలోనైనా సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నాడు. మయాంక్తో పాటుగా యువ పేసర్ ప్రసిధ్ క్రిష్ణ మీద కూడా అందరి చూపు ఉంది. ఈ పేసర్ రంజీలో ఎలా రాణిస్తాడనేది కీలకంగా మారింది.