04-03-2025 07:07:58 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప హరిహర క్షేత్రంలో మంగళవారం అఖిలభారత అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పాటే మా ప్రాణం కార్యక్రమం భక్తులను అలరింపజేసింది. ఈ కార్యక్రమాన్ని మురళీధర్ రెడ్డి వినోదములు ప్రారంభించగా భక్తులు భక్తి పాటలతో అయ్యప్ప స్వామిని కొలుస్తూ భజన కార్యక్రమం సంకీర్తనలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు శనిగారపు చిన్నయ్య నర్సారెడ్డి జక్కుల గజేందర్ ఆలయ కమిటీ సభ్యులు నవయుగ మృతి వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.