న్యూయార్క్, సెప్టెంబర్ 21: హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన దాడులను ఐరాస ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని, యుద్ధనేరంగానూ పరిగణించ వచ్చని తెలిపింది. ఇటీవల పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్ అట్టుడుకుంది. దీనిపై శనివారం ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం నిర్వహించింది. హానిచేయని పోర్టబుల్ వస్తువుల్లో పేలుడు ఉపకరణాలను ఉపయోగించడం సరికాదని పేర్కొంది. హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు తనను ఎంతో భయాందోళనకు గురిచేశాయని హ్యమన్ రైట్స్ ప్రతినిధి వోల్కర్ పేర్కొన్నారు. ఈ దాడులు యుద్ధానికి మరింతగా ఆజ్యం పోస్తాయని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ రాయబారి వాకీటాకీల పేలుళ్ల ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు.