calender_icon.png 1 April, 2025 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతితో మమేకమైన పండుగ ఉగాది

30-03-2025 03:57:05 PM

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్

చేగుంట,(విజయక్రాంతి): ప్రకృతితో మమేకమైన పండుగ ఉగాది పండుగ అని చేగుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ అన్నారు. చేగుంట మండల, పట్టణ ప్రజలకు  ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలందరికీ మేలు జరుగాలని ఆకాంక్షించారు. ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాల్లో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు ఉగాది గొప్ప పర్వదిమనన్నారు. సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలను దీవించాలని ప్రకృతి మాతను ప్రార్థించారు. రైతులు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని.. వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని చెప్పారు.