ముంబై, అక్టోబర్ 14: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధ్యోక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సోమవారం అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని రిలయన్స్ ఆసు పత్రిలో చేర్పించారు. ఛాతీలో నొప్పి తో కొంత అసౌకర్యానికి గురైనట్లు సమాచారం. వైద్యులు ఉద్ధవ్కు ఆంజియోప్లాస్టీ చేయాలని నిర్ణయించారు. కాగా ఆయనకు 2012లో ఓసారి యాంజియోప్లాస్టీ చేయగ్లా 8 స్టంట్స్ వేశారు. తాజాగా మరోసారి ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు.