calender_icon.png 11 October, 2024 | 2:57 PM

చెట్టుకు బైక్ ఢీ కొని ఇద్దరి యువకుల మృతి

11-10-2024 12:08:05 PM

వరంగల్ జిల్లా: రాయపర్తి మండలం లోని వాంకుడు తండా క్రాస్ రోడ్డు సమీపంలో మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం. మృతులు ఇదే మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన ఎర్ర రాజు (28), ఈదునూరి బంటి (22) లుగా గుర్తింపు, పండుగ పూట కిష్టాపురంలో అలుముకున్న విషాద ఛాయలు.