calender_icon.png 11 October, 2024 | 4:22 PM

ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్

11-10-2024 12:19:08 AM

ముషీరాబాద్, అక్టోబర్ 10: నగరంలో బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న ఓ  నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా ఇందల్‌వాయ్ మండలం నల్లవెల్లికి చెందిన ఓదేదు సాయి.. నగరంలోని పలుచోట్ల బైక్‌లు దొంగిలించాడు. అతడిపై నిఘా పెట్టిన పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.