calender_icon.png 6 March, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2.3 కేజీల గంజాయి స్వాధీనం ఇద్దరు నిందితుల అరెస్ట్

06-03-2025 12:04:28 AM

ఒడిశా టు హైదరాబాద్ అక్రమ రవాణా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ ఇన్టెండెంట్ శ్రీనివాస్ రెడ్డి 

రాజేంద్రనగర్ మార్చి 5 (విజయక్రాంతి): ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 2.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఒరిస్సా కేంద్రంగా గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మకాలు చేపడుతున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ లోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంషాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. 

బీహార్ కు చెందిన ప్రదీప్ కుమార్, గజన్ లాల్ స్నేహితులు. వీరు కొన్ని రోజులుగా కూలీ పనులు చేశారు. డబ్బులు సరిపోకపోవడంతో  గంజాయి అమ్మకం వైపు మళ్ళారు. గజన్ లాల్ ఒరిస్సా నుంచి కిలోలలో గంజాయిని తీసుకువచ్చి హైదరాబాదులో ప్రదీప్ కు సరఫరా చేసేవాడు. ప్రదీప్ వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి 150 రూపాయలకు రిటైల్ షాపులలో అమ్మి సొమ్ము చేసుకునేవాడు.

ఈ నేపథ్యంలో బుధవారం విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ సూపరిండెంట్ కృష్ణప్రియ ఆదేశాలతో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్త్స్ర శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది ఫక్రుద్దీన్, మల్లేష్, నెహ్రూ, గణేష్, నిఖిల్, సాయి శంకర్ రాజేంద్రనగర్ పరిధిలోని  ఆరంగర్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహించారు. గజన్ లాల్, ప్రదీప్ కుమార్ లను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 2.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వారిని విచారిస్తున్నారు.