calender_icon.png 19 March, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

19-03-2025 01:19:53 AM

ఖమ్మం, మార్చి 18( విజయక్రాంతి ):-ఓ వ్యక్తిని గొడ్డలితో దారుణంగా నరికి చంపిన కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సత్తుపల్లి 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్ మంగళవారం తీర్పు చెప్పారు.

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం పాత కక్షల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి 19న కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన పాటిబండ్ల శ్రీనివాసరావు ను అదే గ్రామానికి చెందిన అతడి బంధువు పాటిబండ్ల శివ చెన్నూరు - రంగాపురం రోడ్డుపై కత్తితో దారుణంగా నరికి చంపాడని మృతుడి భార్య కృష్ణమ్మ కల్లూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు శివతోపాటు అతడి తల్లి రమాదేవి, తండ్రి అర్జునరావు, నూతలపాటి నారాయణరావు, పస్తం రంగారావు మొత్తం ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

కేసు పూర్వపరాలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఎ1 శివ, ఎ5 రంగారావులపై నేరం రుజువు కావడంతో  పై విధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ అబ్దుల్ బాషా వాదించగా ఐవోలుగా హనోక్ (సీఐ), రఘు (ఎస్త్స్ర), సిడివో మల్లికార్జునరావు సహకరించారు. వీరిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.