calender_icon.png 25 September, 2024 | 3:53 PM

హత్యకేసులో ఇద్దరికి జీవితఖైదు

25-09-2024 12:50:08 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): హత్య కేసులో ఇద్దరికి మంగళవారం నిజామాబాద్ స్పెష ల్ కోర్టు న్యాయాధికారి శ్రీనివాస్ జీవిత ఖైదు విధించారు. గాంధారి మండలం ముదెళ్లికి చెందిన ఒటనో ళ్ల కాశమణి, అంజయ్య దంపతులు. అంజయ్య బాన్సువాడ మండలానికి చెంది బోడ అరుణతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

అరుణను హత్య చేసేందుకు ముదెళ్లికి చెందిన బాలయ్యతో కలిసి కాశమణి పతకం పన్నింది. ఈ క్రమంలోనే అరుణను నమ్మించి కాశమణి గాలిపూర్‌కు తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ ఉన్న బాలయ్యతో క లిసి అరుణను హత్య చేశారు. ఇంటినుంచి వెళ్లిన అరుణ తిరిగి రాకపోవడంతో 30 ఆగస్టు 2019న బా న్సువాడ పోలీసులకు అరుణ భర్త శోభన్ ఫిర్యాదు చేశాడు.

పోలీసులు విచారణ చేపట్టగా కాశమణి, బాల య్య కలిసి అరుణను హత్య చేసిన ట్లు తేలింది. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును విచారించిన న్యాయాధికారి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.