06-03-2025 07:56:08 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఆరేపల్లి స్టేజి వద్ద గురువారం రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నందున రెండు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేశామని తెలిపారు. మండలంలోని ఇసుక వ్యాపారులు అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.