calender_icon.png 25 September, 2024 | 7:46 PM

నారింజ వాగులు ఇద్దరు వ్యక్తులు గల్లంతు

25-09-2024 05:28:31 PM

ఒకరిని కాపాడిన గ్రామస్తులు 

మరొకరు వరద నీటిలో గల్లంతు 

సంగారెడ్డి, (విజయక్రాంతి): కర్ణాటక తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బూచి నెల్లూరు-ఘనాపూర్ శివారు మధ్యలో ప్రవహిస్తున్న నారింజ వాగులో ఇద్దరు వ్యక్తులు గల్లంతు కాగా ఒకరిని గ్రామస్తులు కాపాడారు. బూచి నెల్లి గ్రామస్తుల కథను ప్రకారం... కర్ణాటకలోని బీదర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు నారింజ వాగు దాటుతుండగా వాగులో వరదనీటి ప్రభావం పెరిగిపోయి గల్లంతు కావడం జరిగింది అన్నారు. వరద నీటిలో కొట్టుకుపోతున్న ఒకరిని గ్రామస్తులు కాపాడారు. బీదర్ పట్టణానికి చెందిన ఇస్మాయిల్ ను కాపాడినట్లు గ్రామస్తులు వివరించారు. వర్ధనీటిలో కొట్టుకుపోయిన ఇస్మాయిల్ పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి ఆచూకీ కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు. వరద నీటి ప్రభావం పెరిగిపోవడం బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తున్నంతో వరదనీటిలో కొట్టుకుపోయినట్టు గ్రామస్తులు తెలిపారు.