ఖమ్మం/మంచిర్యాల, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో జాతీయ రహదారిపై డివైడర్ను బైక్ ఢీకొనడంతో సింగరేణి రిటైర్డ్ కార్మికుడు పోరెడ్డి లక్ష్మారెడ్డి(67) గురు వారం మృతి చెందాడు. కలెక్టరేట్లో పని నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా మూన్లైట్ బార్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. మృతు డికి భార్య సుజాత, కూతురు స్వప్న ఉన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం క్రాస్రోడ్డు సమీపంలో గుర్తుతెలియని వాహ నం ఢీకొని మధిరకు చెందిన షేక్ షారూఖ్(26) మృతి చెందాడు.