18 August, 2026 | 1:22 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

ఎస్బీఐ నుంచి రెండు కొత్త డిపాజిట్ స్కీమ్‌లు

04-01-2025 12:00 AM

న్యూఢిల్లీ, జనవరి 3: డిపాజిట్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు కొత్త డిపాజిట్ స్కీమ్‌ల్ని ప్రారంభించింది. ఖాతాదారులకు మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి, విలువను పెంచడానికి ‘హర్ ఘర్ లాఖపతి’, ‘ఎస్బీఐ పాట్రన్స్’ అనే డిపాజిట్ స్కీమ్‌ల్ని డిజైన్ చేసినట్లు శుక్రవారం ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

లక్ష రూపాయ లు,  అంతే గుణిజాల్లో పొదుపును చేకూర్చుకునే రీతిలో ‘హర్ ఘర్ లాఖపతి’ అనే రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ను రూపొందించామని పేర్కొంది. 80 ఏండ్లు, అంతకుపైబడిన సీనియర్ సిటిజన్ల కోసం ‘ఎస్బీఐ పాట్రన్స్’ అనే ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని డిజైన్ చేశామని, బ్యాంక్‌తో దీర్ఘకాలిక సంబంధాన్ని కొనసాగిస్తున్న సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ ద్వారా అధిక వడ్డీ లభిస్తుందని ఎస్బీఐ వివరించింది.