టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ బడా ప్రాజెక్టు ‘వార్-2’లో స్టార్ హీరో హృతిక్ రోషన్తో స్క్రీన్ను పంచుకోనున్నారు. అయితే, ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోలు కూడా కనిపించనున్నారనేదే తాజాగా అందుతున్న సమాచారం. సల్మాన్ఖాన్ సినిమా చివరలో స్పెషల్ ఎంట్రీ ఇస్తారని ముంబయి సినీవర్గాల టాక్. ‘మార్టిన్’ ఫేమ్ ధ్రువ సర్జా కూడా ఇందులో భాగం కావొచ్చని వినవస్తోంది.
దసరా అవ్వగానే ఎన్టీఆర్ సెట్లో అడుగు పెడతారట. అప్పుడు హృతిక్, తారక్పై కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలతోపాటు ఈ ఇద్దరు హీరోలపై ఓ సాంగ్ను చిత్రీకరిస్తారని భోగట్టా. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.