భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని దానవాయిపేట గ్రామ శివారులో సోమవారం ఇద్దరు మావోయిస్టులు, ఒక మహిళా కొరియర్ను చర్ల పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ రోహిత్రాజు వెల్లడించారు. చర్ల పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో వరంగల్ నుంచి వైద్య చికిత్స చేయించుకొని తిరిగి అడవిలోకి వెళ్తున్న ఇద్దరు మావోయిస్టులు, ఒక మహిళా కొరియర్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి పార్టీకి చెందిన పత్రాలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో చతీస్గఢ్ రాష్ట్రం సూకమా జిల్లా బూరుగులంగ గ్రామానికి చెందిన కరటం జోగు అలియాస్ రాజేష్, బీజాపూర్ జిల్లా గొండపల్లి గ్రామానికి చెందిన పూనెం జోగాల్ అలియాస్ రాజుతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు చెందిన కొరియర్ ఎం గీతాగాయత్రి ఉన్నారు.