calender_icon.png 23 October, 2024 | 6:01 AM

దంపతుల నుండి 1.90 లక్షల దోపిడీ

12-09-2024 02:00:44 AM

నిజామాబాద్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వెళ్తున్న దంపతులను అటకాయించిన ఆగంతకుడు వారి చేతిలో ఉన్న రూ.1.90లక్షల నగదు సంచిని సంచిని లాక్కుని పరారయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకు ంది. మాక్లూర్ మండలం వల్లభాపూర్ గ్రా మానికి చెందిన చిన్నయ్య, గంగమ్మ దంపతులు. నవిపేట్ మండలం జన్నెపల్లిలోని కెన రా బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని ద్విచక్రవాహనంపై గ్రామానికి బయలుదేరారు.

స్కూటీపై వచ్చిన ఆగంతకుడు వారి వాహనాన్ని అటకాయించి, గంగమ్మ చేతిలో ఉన్న డబ్బు సంచిని లాక్కుని పరారయ్యాడు. నిం  దితుడు తెలుపు రంగు స్కూటీపై వచ్చాడని, హెల్మెట్ ధరించి ఉన్నాడని బాధితులు నవిపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడు కెనరా బ్యాంకులో డబ్బులు డ్రా  చేసుకుని వెళ్తున్న వారిని పరిశీలించి, పక్కా ప్లాన్‌తోనే దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తున్న ది. కెనరా బ్యాంకు ముందు ఉన్న సీసీ కెమె రా పనిచేయకపోవడంతో నిందితుడిని గు ర్తించలేకపోయారు. కాగా నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ సతీష్, నవిపేట్ ఎస్సై ఘటన స్థలాన్ని పరిశీలించారు.