హైదరాబాద్: శామీర్ పేట్ పరిధిలో శుక్రవారం కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టబోయి కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కారును తప్పించబోయి ఆర్టీసీ బస్సు పక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్నారు.