calender_icon.png 28 September, 2024 | 2:58 AM

బైకులు ఢీకొని ఇద్దరు మృతి

28-09-2024 12:59:53 AM

నల్లగొండ, సెప్టెంబర్ 27(విజయకాంత్రి)/మునుగోడు: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగా యాలయ్యాయి. ఈ ఘటన నల్లగొం డ జిల్లా మునుగోడు మండలం చొ ల్లేడు గ్రామ శివారులో శుక్రవారం జ రిగింది. మర్రిగూడ మండలం నర్సిరెడ్డిగూడేనికి చెందిన కిలికత్తుల ఆంజనే యులు(23), శివన్నగూడేనికి చెందిన బొమ్మగొని నగేష్ బైక్‌పై శివన్నగూడేనికి వెళ్తున్నారు.

మునుగోడు గ్రామా నికి చెందిన రేవెల్లి నాగరాజు(21) వ్యక్తిగత పనులపై చొల్లేడు కు వెళ్లి బైక్‌పై తిరుగు పయణమ య్యాడు. చొల్లేడు శివారుకు చేరుకోగానే వీరి బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో బైకులు నడుపుతున్న నాగరాజు, ఆంజనేయులు తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. నగేష్‌కు తీవ్రగాయాలయ్యాయి.

ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడిని నల్లగొండ ఏరియా దవాఖానకు తరలించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు. రహదారి మూలమలుపు వద్ద కంపచెట్లు ఏపుగా పెరిపోవడంతోనే ప్ర మాదం జరిగిందని స్థానికులు తెలిపారు.