మరో ఇద్దరు కూలీల మరణం
జమ్ముకశ్మీర్ బారాముల్లాలో ఘటన
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడులు జరిపిన ఘటన జమ్ముకశ్మీర్ బారాముల్లాలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ దాడిలో ఇద్దరు సైనికులు మృతి చెందగా మరికొంత మంది గాయపడ్డారు. ఇదే దాడిలో ఇద్దరు సామాన్య పౌరులు కూడా మరణించారని అధికారులు వెల్లడించారు. ఎల్ఓసీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోట్పత్రి ప్రాంతం నుంచి వెళ్తున్న 18వ రాష్ట్రీయ రైఫిల్స్ వాహనంపై ఉగ్రవాదులు దాడులకు తెగబడినట్లు వివరించారు. ఈ దాడి పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్కు చెందిన వాళ్ల పనే అయి ఉంటుందని తాము నమ్ముతున్నామన్నారు. దాడి జరిపిన వెంటనే సైనికులు కౌంటర్ యాక్షన్కు దిగినట్లు వెల్లడించారు. గాయపడిన సైనికులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గురువారం రోజే పుల్వామాలో మరో ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కూలీ తీవ్రంగా గాయపడ్డారు.