calender_icon.png 23 September, 2024 | 4:51 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

23-09-2024 12:10:28 AM

మంథని, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ రంగయ్యపల్లి స్టేజీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మంథని మండలంలోని గోపాల్‌పూర్‌కు చెందిన సిద్దుల శంకర్, తాడిచెర్లకు చెందిన పెంచాల సమ్మక్క అన్నా చెళ్లెళ్లు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్సులో మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.