calender_icon.png 25 September, 2024 | 11:56 AM

కరెంట్ షాక్‌తో ఇద్దరు రైతుల మృతి

25-09-2024 01:23:34 AM

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 24: కరెంట్ షాక్‌తో కౌలురైతు మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం ర ఘునాథపాలెంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన త్రిపురం సతీష్‌రెడ్డి(36) భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చే స్తున్నాడు. పొలంలో విద్యుత్ మోటార్ ఆన్ చేస్తుండగా షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చెరువుమాదారంలో

కూసుమంచి, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండ లం చెరువుమాదారం గ్రామానికి చెందిన రైతు పరిటాల లింగయ్య(57)  మంగళవార ం పొలం వద్ద విద్యుత్ మోటారు ఆన్ చేస్తుండగా షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడి కి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నట్టు గ్రామస్థులు తెలిపారు.