calender_icon.png 22 September, 2024 | 1:54 PM

అస్వస్థతతో ఇద్దరు మృతి

20-09-2024 12:04:12 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విషాదం

రాజేంద్రనగర్, సెప్టెంబర్19: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాదం చోటుచేసు కుంది. అస్వస్థతతో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. ఎయిర్‌పోర్టు అధికారుల కథనం ప్రకారం.. గురువారం మధ్యాహ్నం గోవా నుంచి వచ్చిన నితిన్ అనే వ్యక్తి, అదేవిధంగా జెడ్డా నుంచి వచ్చిన సకీనా అనే మహిళ ఎయిర్‌పోర్టులోకి రాగానే అస్వస్థతకు గురై కుప్పకూలారు. గమనించిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది హుటా హుటిన వారిని అపోలో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.