calender_icon.png 7 October, 2024 | 4:49 PM

హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి

07-10-2024 03:05:24 PM

మేడ్చల్,(విజయక్రాంతి): హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. కండ్లకోయలోని ప్రవేటు కంపెనీ గోదాము సమీపంలో వాహనంలో నిచ్చెన తరలిస్టుండగా హైటెన్షన్ తీగలకు తగిలి ఇద్దరు   ఒప్పంద కార్మికులు అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కండ్లకోయలోని ఆసపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమర్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులు బిహార్ కు చెందిన గుడుబైటా(26), మంగీ(25) అనే ఒప్పంద కార్మికులుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.