calender_icon.png 25 September, 2024 | 6:01 PM

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

25-09-2024 12:52:26 AM

నిర్మల్, సెప్టెంబర్ 24(విజయక్రాంతి)/అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండ లం జగ్గారం గ్రామంలో మంగళవా రం సాయంత్రం పిడుగుపాటుకు ఇ ద్దరు యువతులు మృతి చెందారు. జగ్గారం గ్రామంలో పొలం పనులు చేస్తున్న కూలీలపై పిడుగు పడటం తో ముగ్గురు అస్వస్థతకు గురయ్యా రు. వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అనూష, నాగశ్రీ మృతి చె ందగా సీతమ్మ పరిస్థితి విషమంగా ఉన్నది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాయపూర్‌లో పిడుగుపాటుకు మూడు పశువులు మృతి చెందాయి. 

జనగామలో జోరు వాన

జనగామ, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): జనగామ పట్టణంలో మంగళవారం జోరు వాన కురిసిం ది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 50 నిమిషాల పాటు పట్టణ ంలో వర్షం దంచికొట్టింది. దీంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. జ్యోతినగర్, బాలాజీనగర్‌తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి. ఆర్టీసీ చౌరస్తా నుంచి హైదరాబాద్ రోడ్డు చెరువును తలపించింది.