calender_icon.png 20 September, 2024 | 5:30 PM

జాతీయ రహదారిపై రెండు బైకులు ఢీ.. పలువురికి గాయాలు

20-09-2024 03:08:52 PM

ఆందోల్,(విజయక్రాంతి): నాందేడ్ అకోలా సంగారెడ్డి 161 జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. జోగిపేట సమీపంలోని డాకూర్ గ్రామ శివారులో రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్ర గాయాలు కాగా.. ఏ ప్రాణ నష్ట్రం కలుగలేదు. క్షతగాత్రులను అంబులెన్స్ లో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని ఘటన స్థలిని పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన వారు అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ గ్రామస్తులుగా, మరొకరు నారాయణఖేడ్ పట్టణవాసులుగా గుర్తించారు.