calender_icon.png 15 October, 2024 | 8:50 AM

యువకుడి హత్య కేసులో ఇద్దరి అరెస్టు

15-10-2024 02:30:10 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి): జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 13న తెల్లవారుజామున జరిగిన ఎండీ నదీమ్ పాష అనే యువకుడి హత్య కేసులో ఎండీ ఖలీల్, కట్ట ప్రసాద్ అలియాస్ వరప్రసాద్ అనే యువకులను సోమవారం అరెస్ట్ చేసినట్లు బాలనగర్ డివిజన్ ఏసీపీ హన్మంత్‌రావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తన బర్త్ డే వేడుకలకు కట్ట ప్రసాద్ స్నేహితులను ఆహ్వానించాడు. 

ఈ సందర్భంగా నదీమ్, ఖలీల్, కట్ట ప్రసాద్‌ల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. అనంతరం తెల్లవారు జామున జరిగిన గొడవలో నిందితులు ఐరన్ రాడ్‌తో నదీమ్ తలపై బలంగా కొట్టి హత్య చేసి పరారయ్యారు. విచారణ చేపట్టిన పోలీ సులు సోమవారం నిందితులను అరెస్టుచేసి, వారి నుంచి 2 మొబైల్స్, హత్యకు ఉపయోగించిన ఐరన్‌రాడ్, రక్తంతో తడిసిన బట్టలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ చెప్పారు.