calender_icon.png 22 October, 2024 | 11:23 PM

అంగన్వాడీ టీచర్ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్

17-05-2024 05:07:31 PM

ములుగు: జిల్లాలో సంచలన సృష్టించిన అంగన్వాడీ టీచర్ సుజాత హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అడవిలో అంగన్వాడీ టీచర్ పై అత్యాచారానికి ప్రయత్నించారు. ప్రతిఘటించిన టీచర్ ను రాయితో కొట్టి హత్య చేశారు. నిందితులను రామయ్య, జంపయ్యగా రిమాండ్ తరలించారు. నిందితులు ఏటూరునాగారం మండలం రొయ్యూరు వాసులుగా గుర్తించారు. నిందితుల నుంచి 3 తులాల బంగారం, బైకు స్వాధీనం చేసుకున్నారు.