నిర్మల్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ముదోల్ మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాం కులో చోరీకి యత్నించిన ఇద్దరిని శనివారం పోలీసులు అదు పులోకి తీసుకున్నారు. తెలిసిన వివరాల ప్రకారం.. ఎస్బీఐ లోకి ఈనెల 13న షేక్ ముషీర్ అహ్మద్, మహ్మద్ ఇర్ఫాన్ ప్రవేశించారు. బ్యాంక్లో చోరీకి విఫలయత్నం చేసి అక్కడి నుంచి ఉడాయించా రు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి సీపీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ముదోల్ సీఐ మల్లేశ్ నేతృత్వంలో పోలీసులు నిందితులిద్ద రినీ అదుపులోకి తీసుకున్నా రు. నిందితులు నేరాన్ని అంగీకరించారని సీఐ తెలిపారు.