calender_icon.png 11 October, 2024 | 10:32 PM

అగ్నివీరుల శిక్షణ శిబిరంలో ప్రమాదం.. ఇద్దరు జవాన్లు మృతి

11-10-2024 08:34:30 PM

నాసిక్,(విజయక్రాంతి): మహారాష్ట్రలో ఇద్దరు అగ్నివీరులు మృతి చెందారు. నాసిక్ లోని డియోలాలి శిబిరంలో ఇండియన్ ఫీల్డ్ గన్ తో కొంతమంది అగ్నివీరుల బృదం ఫైరింగ్ సాధన చేస్తుండగా ఇండియన్ ఫీల్డ్ గన్ లోని అర్టిలరీ షెల్  పేలడంతో ఇద్దరు అగ్నివీర్ శిక్షణా జవాన్లు  తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డిన ఇద్దరు జవాన్లు వెంటనే దేవ్ లాలీలోని ఎంహెచ్ ఆసుపత్రికి తరలించారు. వారు చికిత్స పొందుతూ.. ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన జవాన్లు హైదరాబాద్ కు చెందిన గోహిల్ విశ్వరాజ్ సింగ్, సైఫత్ అని గుర్తించారు.  హవల్దార్ అజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.