22-02-2025 10:47:35 PM
పాల్వంచ,(విజయక్రాంతి): ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా పాల్వంచ మండలంలోని జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో శనివారం కళల కవలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు పాఠశాల హెడ్ మాస్టర్ చెల్లూరి రమాదేవి కూడా కవలగా జన్మించడంతో ఆ పాఠశాలలోని ముగ్గురు కవల పిల్లలతో కలిసి కవలల దినోత్సవం జరుపుకున్నారు. పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న జాటోత్ ప్రవళిక, ప్రణీత, 3వ తరగతి చదువుతున్న కందుకూరి రుష్మంత్ , రేవంత్, మాలోత్ చరణ్, చరణ్ రాజ్ లతో కలిసి హెడ్మాస్టర్ రమాదేవి కేకులు కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు, చాక్లెట్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భానోత్ శ్రీనివాస్, వై వెంకటేశ్వర్లు, సుజాత విద్యార్థుల తల్లిదండ్రులు శిరీష, నజీమా , మహాలక్ష్మి, వెంకటమ్మ , మణికుమారి తదితరులు పాల్గొన్నారు.