01-03-2025 01:15:12 AM
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ నూతన సారథిగా తుహిన్ కాంత పాండే నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న ఆయనకు సెబీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర నియామకాల కమిటీ గురువారం ఇందుకు ఆమోదం తెలిపింది.
కాగా, ప్రస్తుతం సెబీ చీఫ్గా ఉన్న మాధబీ పురీ బుచ్ మూడేళ్ల పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో తుహిన్ కాంత పాండేను సెబీ కొత్త చీఫ్గాప్రభుత్వం నియమించింది. తుహిన్ కాంత పాండే 1987 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయన గతంలో ఆర్థిక కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు.
ఎయిరిండియా ప్రైవేటీకరణలో పాండే కీలక పాత్ర పోషించారు. తుహిన్ కాంత పాండేకు ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో విస్తృత అనుభవం ఉంది. రాను న్న మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.