calender_icon.png 20 October, 2024 | 1:32 PM

విదూషకుడిలా ట్రూడో తీరు

18-10-2024 01:56:46 AM

కెనడా ప్రధానిపై భారత్ ఆగ్రహంన్యూఢిల్లీ

 అక్టోబర్ 17: తరుచూ సంచలనాలకోసం నిరాధార ఆరోపణలు చేస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యతో భారత్‌కు సంబంధం ఉందని ఆరోపిస్తూ వస్తున్న ఆయన.. స్పష్టమైన ఆధారాలు చూపాలని గట్టిగా నిలదీయంలో మాట మార్చిన విషయం తెలిసిందే. తనవద్ద స్పష్టమైన ఆధారాలు లేవని, ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే మాట్లాడానని ఆయన బుధవారం ప్రకటించారు. దీంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇబ్బందుల్లో పడటానికి ఏకైక కారకుడు ట్రూడోనేనని మండిపడింది. ట్రూడో తీరు రాజాస్థానంలో విదూషకుడిని తలపిస్తున్నదని ఎద్దేవా చేసింది.