calender_icon.png 24 October, 2024 | 12:47 PM

Breaking News

కార్లను ఢీకొట్టిన ట్రక్కు: నలుగురు మృతి

29-06-2024 04:22:06 PM

బీజింగ్: తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో శనివారం తెల్లవారుజామున భారీ ట్రక్కు నాలుగు కార్లను ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. జియాక్సింగ్ సిటీలోని నన్హు జిల్లా పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో ప్రకారం, ప్రమాదం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.27 గంటలకు కూడలి వద్ద జరిగిందని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. నాలుగు కార్లు ఎదురుగా వెళ్తున్న సమయంలో భారీ ట్రక్కు వారిని ఢీకొట్టింది. యాంగ్ అనే ట్రక్ డ్రైవర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు.