calender_icon.png 17 October, 2024 | 2:39 PM

గోపాలపుర్ లో ఇసుక లారీలతో గోస..

17-10-2024 12:51:53 PM

 ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్తులు

మంథని (విజయక్రాంతి): మంథని మండలంలోని గోపాలపూర్ గ్రామంలో ఇసుక లారీలతో అరిగోస పడుతున్నామని గురువారం గ్రామస్తులు ఇసుక లారీలను అడ్డుకున్నారు. రోడ్డు పై నీళ్లు కొట్టక ద్విచక్ర వాహనంపై రోడ్డుపై ప్రయాణిస్తామంటే దుమ్ము లేచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆగ్రహంతో లారీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. రోడ్డుపై ఒకేసారి పది నుంచి 20 లారీల వరకు వెళుతున్నాయని, దీంతో విపరీతమైన దుమ్ము లేచి కళ్ళలో పడుతుందని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తామంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపరించిందని గ్రామస్తులు అధికారులపై, కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా ట్యాంకర్ లతో రోడ్డుపై నీళ్లు కొట్టడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.