09-02-2025 04:41:08 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని మురళీకృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పలువురికి సన్మానం చేశారు. స్థానిక కౌన్సిలర్ గా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మేడారంపు అపర్ణ ప్రదీప్ తో పాటు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న పలువురిని సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు కిషన్, గంగాధర్, గుప్తా తదితరులు ఉన్నారు.