calender_icon.png 3 February, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వర్గీయ పోత్నక్ రోజాకు నివాళి

03-02-2025 12:10:02 AM

యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 2 :  ఇటీవల అనారోగ్యంతో మరణించిన పిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ సతీమణి  స్వర్గీయ రోజా  దశదిన కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఆదివారం జరిగింది. ఈ  కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఎం. ఎల్. సి. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,  తెలంగాణ శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి లు పాల్గొని రోజా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ప్రమోద్ కుమార్ కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారితోపాటు  ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య , భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,  శాసనసభ్యులు  కుంభం అనిల్ కుమార్ రెడ్డి , మాజీ ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,  డిసిసిబి మాజీ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు  అండం సంజీవరెడ్డి ,

రాష్ట్ర ముఖ్యమంత్రి  పి ఆర్ ఓ  బోరెడ్డి అయోధ్య రెడ్డి , మాజీ శాసనసభ్యులు  పైల్ల శేఖర్ రెడ్డి చింతల వెంకటేశ్వర్ రెడ్డి, మదర్ డైరీ మాజీ చైర్మన్ జితేందర్ రెడ్డి, చౌటుప్పల్ ఏసిపి శ్రీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి , బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి పి యాదయ్య , మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ గడ్డం విజయ భార్గవ్,  బిజెపి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ ,

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎండి అవేష్ , మాజీ చైర్మన్ శ్రీ జడల అమరేందర్ గౌడ్ , మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, డి రాములు, సిపిఎం రాష్ట్ర నాయకులు కల్లూరి మల్లేశం , బట్టుపల్లి అనురాధ, మాయ కృష్ణ, సిపిఐ నాయకులు ఎండి ఇమ్రాన్ ఏశాల అశోక్, ఉప్పల ఉదయ్ ,దళిత సంఘం నాయకులు బట్టు రామచంద్రయ్య , శివలింగం, ఎమ్మార్పీఎస్  నాయకులు ఇటుకల దేవేందర్ , దర్గాయి హరి ప్రసాద్,కొల్లూరి రాజు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు.