21-03-2025 01:03:54 AM
కల్లూరు,మార్చి 20 :- కల్లూరు మేజరు గ్రామ పంచాయితీ నీ మున్సిపాలిటీ గా అసెంబ్లీలో ముసాయిదా ప్రతిపాదన తీసుకురావడానికి కృషి చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని గురువారం కల్లూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు యాసా శ్రీకాంత్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లం ఉపేందర్, మేకల సాంబశివరావు, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.