calender_icon.png 21 October, 2024 | 12:35 AM

గ్రామానికి రోడ్డు మంజూరు చేసిన శ్రీధర్ బాబుకు సన్మానం

20-10-2024 03:06:25 PM

మంథని (విజయక్రాంతి): మంథని మండలంలోని ఎగ్లాస్పూర్ ప్రధాన రహదారి నుండి ఖానాపూర్ టు ఎల్ మడుగు వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 7కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును ఖానాపూర్ గ్రామస్థుల తరపున కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కలిసి మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంథని మండల మాజీ ఎంపీపీ నారమల్ల లక్ష్మీరాజం, మాజీ సర్పంచ్ దొరగొర్ల శ్రీనివాస్, గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు బాస అశోక్, గ్రామశాఖ ఉపాధ్యక్షుడు పుట్ట సుధాకర్, పార్టీ సీనియర్ నాయకులు సంగెం గట్టయ్య, రాధారపు కోటేశ్వర్, తోట సుధాకర్, జంజర్ల నరేష్, సేమంతుల అఖిల్ పాల్గొన్నారు.