బిచ్కుంద, ఫిబ్రవరి 4: (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం సామాజిక ఉద్యమ నేత మంద కృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ మాదిగ ప్రజా ప్రతినిధుల బృందంతో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు మందకృష్ణ మాదిగ కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ ఆరట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం పాల్గొన్నారు.