calender_icon.png 20 September, 2024 | 6:12 AM

మర్డర్ చేసినోళ్లకు ఇచ్చే ట్రీట్‌మెంట్ ఇవ్వాలి

20-09-2024 12:00:00 AM

జానీ మాస్టర్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత మర్డర్ చేసే వాళ్లకి, దొంగతనం చేసే వాళ్లకు ఏ విధంగా ట్రీట్‌మెంట్ ఇస్తారో అదేవిధంగా చేయాలని పోలీసులను కోరుతూ గురువారం ఓ వీడియో విడుదల చేశారు. లవ్ జిహాదీకి పాల్పడిన జానీని సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మతం మార్చుకోవాలని అమ్మాయిలను జానీ మాస్టర్ హింసించారని, మహిళల రక్షణ కోసం బలమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ ఒక్క యువతినే కాకుండా ఇం కా ఎంతమంది అమ్మాయిలను జానీ ఇబ్బంది పెట్టి మతం మార్చుకోవాలని చెప్పారో ఆ విషయాలన్నీ బయటపెట్టాలని పోలీసు అధికారులను రాజాసింగ్ కోరారు. 

స్పందించిన మంచు మనోజ్..

జానీ మాస్టర్ వ్యవహారంపై సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘ ఈ స్థాయికి రావడానికి జానీ మాస్టర్ ఎంతగా శ్రమించారో అందరికీ తెలుసు.. ఆయనపై ఆరోపణలు రావడం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది.. అసలు తప్పు ఎవరిది అనేది చట్టం నిర్ణయిస్తుంది.. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం భావిత రాలకు ప్రమాదకర మెసేజ్.. ఈ కేసులో త్వరగా స్పందించిన హైదరాబాద్ పోలీసులను ప్రత్యేక కృతజ్ఞతలు.. మాస్టర్ తప్పు చేయకపోతే పోరాడండి.. దోషి అయితే వెంటనే లొంగిపోండి’ అని మంచు మనోజ్ ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు.