21-03-2025 12:00:00 AM
మహబూబాబాద్.మార్చి 20 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని గం గారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రం గంగారం నందు క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రధానమంత్రి టీవీ ముక్తాభియాన్ కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో14 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు పో షకాహార కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో టీవీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్ట ర్ విజయకుమార్ మాట్లాడుతూ టీబి ని న యం చేయాలంటే క్రమం తప్పని మందులతో పాటుగా మంచి ఆహారం తీసుకుంటే త్వరగా తగ్గిపోతుంది అని తెలిపారు.
ఈ సం దర్భంగా క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిడ్స్ అందించినటువంటి హెల్త్ ఎడ్యుకేటర్ పురుషోత్తం మరియు గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాలు ప్రత్యూష ను అభినందించారు. కార్యక్రమంలో డా. శ్రీకాంత్, డాక్టర్ సాయినాథ్, సబ్ యూనిట్ ఆఫీసర్ గోపీచంద్ క్షయ వ్యాధి సిబ్బంది భాస్కర్, నీ లిమ,అశోక్ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.