ఎమ్మెల్యేలు శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, శ్రీహరి
మహబూబ్నగర్, జూలై 21 (విజయక్రాంతి) : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, మక్త్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 24,600 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 68వేల మంది ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేపట్టామన్నారు. బదిలీల కార్యక్రమం ఎక్కడా, ఎవరికీ ఇబ్బంది లేకుండా జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, డీఈవో రవీందర్, గద్వాల జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సరితమ్మ, పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్రెడ్డి, శ్యాంబాబు, గట్టు వెంకట్రెడ్డి, దూకుడు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.