29-04-2025 08:17:32 PM
ఏరియా పిఎం శ్యామ్ సుందర్...
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి అధికారుల (సూపర్వైజర్స్) నివాస గృహాల కేటాయింపుకు చేపట్టిన కౌన్సిలింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. మంగళవారం ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో నిర్వహించిన కాన్సిలింగ్ లో సీనియార్టీ ప్రకారం గృహాలు కేటాయించడం జరిగిందని పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్(Personnel Manager S. Shyam Sundar) తెలిపారు. సింగరేణి సంస్థలో ఉద్యోగాలు చేస్తున్న ఏరియాలోని సూపర్వైజర్స్ కు కేటాయించబడిన క్వార్టర్లను ఎంపిక చేసుకోవడానికి అందుబాటులో ఉన్న క్వార్టర్ల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ కు ఏరియాకు 20 క్వాటర్స్ ప్రకటించగా,10 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా, సీనియార్టీ ప్రకారం 8 మంది సూపర్వైజర్ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, డివైపిఎం మైత్రేయ బంధు, మేనేజ్మెంట్ ట్రైని ఐఈడి శ్యామ్ లు పాల్గొన్నారు.