11-02-2025 12:00:00 AM
నాగల్ గిద్ద, ఫిబ్రవరి 10: నాగల్ గిద్ధ మండల ఫత్తూ నాయక్ తండాలో ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ అనే శీర్షికతో విజయక్రాంతి దినపత్రికలో వార్త ప్రచురితం కావడం జరిగింది. సోమవారం విద్యుత్ శాఖ అధికారులు విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించి ఏఇ మోతిరం, లైన్ మేన్ గంగయ్య వెళ్లి ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. భూమిపై ఉన్న ప్రాన్స్ ఫార్మర్ ను అధికారులు పైకి బిగించారు. ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను అధికారులు పైకి ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు రైతులు విజయక్రాంతి దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.